Saturday, August 5, 2023

మణిపూర్ చరిత్ర part 2

(Facebook లో పార్థసారథి పొట్లూరి గారి పోస్ట్ copy paste. )
యూరోపియన్ చర్చి కి ఈశాన్య భారత్ మీద శ్రద్ధ ఉంది!
దీనిని బలపరిచే చరిత్ర కి చెందిన బలమయిన సాక్ష్యాలు ఉన్నాయి అవి మనకి తెలినవే!
1.1947కి పూర్వమే ఈశాన్య భారత్ లో చర్చి కార్యకలాపాలు ఉన్నాయి . అలాగే 1947 తరువాత కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తమకి అనుకూలంగా చట్టాలను చేయించుకుంది.
2.మరోవైపు దేశ విభజన తరువాత తూర్పు పాకిస్థాన్ ని (ఇప్పటి బాంగ్లాదేశ్)కేంద్రంగా చేసుకుని అమెరికన్ CIA ఈశాన్య భారత్ మీద నిఘా పెట్టి చర్చికి సహకరిస్తూ వచ్చింది.
3. ప్రపంచం దృష్టిలో CIA వేరు చర్చి వేరు వేరుగా కనిపిస్తాయి. కానీ వాస్తవం ఏమిటంటే CIA చర్చి రెండూ ఒకరికి ఇంకొకరు సహకరించుకుంటాయి! ఇది బహిరంగ రహస్యం! అటవీ ప్రాంతంలో ఎక్కడన్నా చర్చి ఉంది అంటే అది CIA కి ఇంఫార్మేర్ గా పనిచేస్తుంది. అఫ్కోర్స్ ఇది గత రెండు వందల ఏళ్ల నుండి జరుగుతూనే ఉంది.
4.తూర్పు పాకిస్థాన్ లో ఏకంగా CIA కి ఆఫీసు ఉండేది. అంటే ఇప్పటి బాంగ్లాదేశ్ ని కేంద్రంగా చేసుకుని CIA మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, మేఘాలయ లో ఉన్న చర్చి ల నుండి కొరియర్ ల ద్వారా సమాచారం సేకరించేది.
5.1970 వ దశకంలో మిజోరం లో తీవ్రవాదం ప్రబలంగా ఉండేది. దీనికి CIA, చైనా, పాకిస్థాన్ ల నుండి ఆయుధాలు, డబ్బు, మిలటరీ గ్రేడ్ మందులు బర్మా ద్వారా మిజో నేషనల్ ఫ్రంట్ కి అందేవి.
6.మిజోరంలో అప్పటికే చర్చి కి సంబంధించి నెట్వర్క్ బలంగా ఉండేది. కాబట్టి సమాచారం బయటికి వచ్చేది కాదు.
7.1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం మొదలవుతుంది అని ముందుగానే పసిగట్టిన CIA ఇందిరకి పరోక్షంగా హెచ్చరికలు చేసింది.ఎందుకంత ఆసక్తి?
8.బంగ్లాదేశ్ లోకి భారత సైన్యం ప్రవేశించగానే బ్రిటన్, అమెరికాలు తమ నౌకా దళం ని బంగాళాఖాతంలో కి వెళ్ళడానికి ఆదేశాలు ఇచ్చాయి.
9.ఒకవేళ అమెరికన్ 7th ఫ్లీట్ నౌకాదళం కనుక చిట్టగాంగ్ రేవు కి చేరుకుంటే అది ఖచ్చితంగా తనని బంధించి అంతర్జాతీయ కోర్టులో తనని యుద్ధ నేరాల మీద విచారణ చేసి జైల్లో పెడతారని ఇందిర తన పిల్లలని తీసుకొని లండన్ వెళ్లిపోయింది.
10.ఇందిరని వాజపేయి గారు 'అపర దుర్గ' గా అభివర్ణించడం అనేది అబద్ధం.
11.శ్రీమతి పుపుల్ జయకర్ వ్రాసిన ఇందిరాగాంధీ- A బయోగ్రఫీ( PUPUL JAYAKAR – INDIRAGANDHI A BIOGRAPHY)పుస్తకంలో  ఇందిరని అపర దుర్గ గా వాజపేయి గారు అన్నారు అని తన స్వంత పైత్యం ని జోడించింది. దీని మీద వివరణ ఇస్తూ వాజపేయి గారు చాలా సార్లు ప్రెస్ మీట్ లలో చెప్పారు నేను అలా అనలేదు అని.
12 . సరే! సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయ ప్రస్తావన చేయాల్సి వచ్చింది. కానీ బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ ప్రయాత్నాలని అమెరికా, బ్రిటన్, చైనా, పాకిస్థాన్ లు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించాయి?
13.పాకిస్థాన్ కి అవసరం ఉంది ఎందుకంటే అది తూర్పు పాకిస్థాన్ కాబట్టి. కానీ అమెరికా బ్రిటన్ చైనాల కి ఎందుకు అంత ఆసక్తి? అమెరికా, బ్రిటన్, చైనాలకు ఈశాన్య భారతదేశం మీద ఆశ ఉంది. బంగ్లాదేశ్ కి సరిహద్దుల్లో ఉంది. బాంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడితే వాళ్లకి నిఘా పెట్టడం కష్టం అవుతుంది కనుక.
14.చైనా కి అరుణాచల్ ప్రదేశ్ కావాలి. తరువాత ఒక్కో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.
15.బ్రిటన్ అమెరికాలకి మణిపూర్ కావాలి. 
16. అందుకే కమ్యూనిస్టు దేశం అయినా చైనాతో సఖ్యతగా ఉంది అమెరికా. మరో వైపు పాకిస్థాన్ తో అమెరికా అంట కాగడానికి కారణం తూర్పు పాకిస్థాన్. అది 1971 లో చేజారిన తరువాత అమెరికాకి  పాకిస్థాన్ అవసరం లేకపోయింది. కానీ సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్ లో ప్రవేశించిన తరువాత మళ్ళీ పాకిస్థాన్ అవసరం ఏర్పడింది అమెరికాకు.
17.ఇక్కడ జియో పాలిటిక్స్ ని అర్ధం చేసుకుంటే భారత్ తో అమెరికా, చైనా, పాకిస్థాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ లకి ఎందుకు శత్రుత్వం కొనసాగుతున్నదో తెలుస్తుంది.
18. కాశ్మీర్ ని ముస్లిమ్స్ పంచుకోవడానికి సహకరించిన పశ్చిమ దేశాలు మిజోరం, మణిపూర్ లని క్రైస్తవ దేశాలు పంచుకోవడానికి సహకరించాలి పాకిస్థాన్. ఇక అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఆక్రమించుకోవడానికి అమెరికా, పాకిస్థాన్ సహకరించాలి.
19.ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికాతో సహా ఐరోపా మొత్తం క్రైస్తవ దేశాలు. చైనా కమ్యూనిస్ట్ దేశం. పాకిస్థాన్ ఇస్లామిక్ రిపబ్లిక్. ఈ మూడు కూడా వేటికి అవే భిన్న ధృవాలు కానీ ఈశాన్య భారత్ విషయంలో ఒక్కటిగా కలిసి పోయాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.
20. చాలా వ్యూహాత్మకంగా 2014 నుండి పాశ్చాత్య విలేఖరులు బిజెపి ప్రభుత్వాన్ని హిందూ నేషనలిస్ట్ అని సంబోధిస్తున్నాయి కానీ ఇస్లామిక్ పాకిస్థాన్ అని కానీ, క్రిస్టియన్ నేషనలిస్ట్ బ్రిటన్ అని హెడ్డింగ్స్ పెట్టి వార్తలు వ్రాసాయా?
21.ఏదో ఒక కారణం చూపించి బలహీన దేశాల మీద దాడులు చేయడం నాటో దేశాలకి అలవాటు. దానికి ముందస్తుగా వాళ్ళకి కావాల్సిన చోట హింసను ప్రేరేపించడం చేస్తారు. ఆ హింస ఎలా ఉంటుంది అంటే స్థానిక ప్రభుత్వాలు అదుపు చేయలేనంతగా.
22.హింసను ప్రేరేపించడానికి గాను పుష్కలంగా డబ్బు, ఆయుధాలు సరఫరా చేస్తారు. ఈతరహా చర్యలు చాలా చోట్ల ఫలితాలని ఇచ్చాయి. అయితే కేవలం ఎవరి ఆదేశాలనో పాటిస్తూ గుడ్డిగా హింసకి పాల్పడరు ప్రజలు.
23.మత విశ్వాసాలని ఆయుధంగా వాడుకుంటారు.
24.డ్రగ్స్ అలవాటు చేసి ఆపై వాటిని తయారుచేసి సరఫరా చేసి డబ్బు సంపాదించడం అలవాటు చేస్తారు.
25.డ్రగ్స్, డబ్బు,ఆయుధాలు పుష్కలంగా సమకూరాక మత విశ్వాసానికి ముప్పు ఏర్పడ్డది అంటూ హింసకి ప్రేరేపిస్తారు.
25.CIA అనుసరించే ఈ తరహా ప్లాన్ కి చర్చి సహకరిస్తుంది.కేవలం మనుషుల్ని కొరియర్లు గా వాడుకున్న రోజుల్లోనే CIA,చర్చి విజయంతంగా తమ ఆపరేషన్స్ పూర్తిచేయగలిగాయి.
25.అలాంటిది కమ్యూనికేషన్ అనేది వివిధ రూపాలలో చాలా సురక్షిత రూపంలో తేలికగా లభ్యం అవుతున్నప్పుడు ఇంకెంత రహస్యంగా ఆపరేషన్స్ ని నిర్వహించుకోగలుగుతారు?
********************
మిజోరం అనే రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రం అని అధికారికంగా ప్రకటించబడ్డది అని ఎంతమంది కి తెలుసు?
అవును! మిజోరం క్రైస్తవ రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించబడ్డది!
దీనికి పునాది 1856 లో పడ్డది!
బ్రిటిష్ వాళ్ళు 1856 లో మొదటి చర్చి కట్టిన తరువాత మిజోరంలో స్థానిక మిజో లని క్రైస్తవంలోకి మార్చడం మొదలుపెట్టారు.
Presbyterian Church అనేది మిజోల జీవితాలలో ఒక భాగం అయిపోయింది. 
విచిత్రం ఏమిటంటే Presbyterian Church కి సంబంధించి ప్రధాన కార్యాలయం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఉంది.
అంటే మిజోరం తో పాటు మేఘాలయ కూడా లిస్టు లో చేరిపోయింది అన్నమాట.
మిజోరం లో 88% క్రైస్తువుల జనాభా ఉంది.
3.3% హిందువుల జనాభా అదీ మణిపూర్ కి చెందిన మెయితీ లు 6 వేల మంది ఉన్నారు.
7.93% చెక్మా తెగకి చెందిన బౌద్ధులు ఉన్నారు కానీ వీళ్ళు బర్మా లోని ఆర్కాన్ ప్రాంతం నుండి వలస వచ్చినవాళ్ళు .
8000 వేల మంది మిజో బేనీ యూదులు కూడా ఉన్నారు.psp
******************
మిజోరం రాష్ట్రంలో ఏ నిర్ణయం అయినా చర్చి తీసుకుంటుంది దానిని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఆదివారం అందరూ చర్చికి వచ్చి ప్రార్ధనలు చేయాల్సిందే. ఇందుకోసం వ్యాపార సంస్థలు మూసివేస్తారు.
మీరు ఒక టూరిస్టు గా మిజోరం రాజధాని ఐజ్వాల్ కి వెళ్లారు అంటే శనివారంనాడు మంచినీళ్ళు బాటిల్స్ కొని పెట్టుకోవాలి లేకపోతే ఆదివారం టీ, టిఫిన్,భోజనం తో పాటు మంచినీళ్ళు బాటిల్స్ కూడా దొరకవు. అన్నీ షాపులు,రెస్టారెంట్స్ మూసి ఉంటాయి.
ఏదన్నా ముఖ్యమయిన ప్రకటన ఉంటే దానిని ఆదివారం చర్చికి ప్రార్ధన కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రకటిస్తారు దానిని అందరూ పాటిస్తారు.
********************
మనలో చాలా మందికి సుపరిచితమయిన ఫోటో ఒకటి ఉంది. అది మిజోరం రాజధాని ఐజ్వాల్ లో రోడ్ మీద ట్రాఫిక్ ఒక క్రమ పద్ధతిలో ఒక వాహనం వెనుక ఇంకొక వాహనం నిలిచి ఉన్న వైనం. కుడి వైపు మార్గం ఎదురుగా వచ్చే వాహనాలకు ఖాళీగా వదిలివేయబడి ఉండడం.
అలా క్రమశిక్షణ తో వాహనదారులు ఉండడం మంచిదే!
కానీ……
మిజోరం ప్రజలు తమని తాము యూరిపియన్ ల లాగా భావించుకోవడమే దాని అర్ధం!
పాకిస్థాన్ ప్రజలు తాము అరబ్బుల వారుసులము అని భావించుకుంటారు!
మిజోరం, మేఘాలయ, నాగాలాండ్,మణిపూర్ లోని పర్వత ప్రాంతాలతో కలుపుకొని ప్రత్యెక క్రైస్తవ దేశం కావాలని భవిష్యత్తులో ఆందోళనకి దిగకుండా ఉంటారా?
******************
మెజారిటీ ప్రజల కోరిక కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయమని అమెరికాతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ మన ఒత్తిడి చేయవు అన్న గ్యారంటీ ఉందా?
******************
ఇప్పటికే మణిపూర్ హింస మీద యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ గట్టిగా చర్యలు తీసుకోమని కోరింది ఎందుకు?
ఇద్దరు మహిళలు క్రైస్తువుల కాబట్టి!
*******************
బానిస కుతంబ చెక్ పోస్ట్:
ఎక్కడికి పోతున్నావు?
చర్చి:మిజోరం పోతున్నాను.
చెక్ పోస్ట్:వెనక ఆ మూట ఏమిటి?
చర్చి: ఇసుక
చెక్పోస్ట్:ఇంగ్లాండ్ నుండి ఇసుక తీసుకెళ్లి మిజోరం లో ఏం చేస్తావు?
చర్చి: జస్ట్ చల్లుతాను
చెక్ పోస్ట్: మిజోరం లో ఇసుక లేదా?
*************
చెక్ పోస్ట్ ఉద్యోగం పోయాక….
రేయ్ ఆగు ఆగు!
ప్రతిసారీ ఎదో పట్టుకెళ్లి పోయేవాడివి అదేందో చెప్పరా! 2014 లో చెక్ పోస్ట్ జాబ్ పోయింది రా నీ దయవల్ల.
చర్చి:ప్రతిసారి మూట(కాశ్మీర్) లో ఏముంది అని మూటని(కాశ్మీర్) చెక్ చేశారు కానీ …ఒకసారి కైనెటిక్ హోండా(మిజోరం) మీద వచ్చాను, ఇంకోసారి హోండా బైక్(మేఘాలయ) మీద వచ్చాను..ఇంకోసారి సుజుకి (నాగాలాండ్) మీద వచ్చాను. 
బానిస వారసత్వ ఉద్యోగమా?
అవును!
అందుకే దేశం …… నాకి పోయింది!
ఇంకా ఉంది…
జైహింద్!

No comments: