Wednesday, August 9, 2023

మణిపూర్ చరిత్ర part 3


(Face book లో పార్థసారథి పొట్లూరి గారి పోస్ట్)
ప్రస్తుత మణిపూర్ హింసకి మతం రంగు పూయడానికి చేసిన ప్రయత్నం కొంత వరకు సఫలీకృతం అయ్యింది!
కానీ నిజాలు నిలకడగా బయటపడుతున్నాయి!
***************
ఎవరు ఏమి ఆశించి ఈ దారుణాలకి ఒడి గడుతున్నారు?
ఇక్కడ దారుణం అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది?
అది దారుణం కానే కాదు! ప్రీ ఫాబ్రికేటెడ్!
నగ్నంగామహిళలని ఊరేగించింన వ్యక్తి మెతీ తెగకి చెందిన వాడు అన్నది నిజం! కానీ సదరు వ్యక్తి కూడా క్రిస్టియన్!
కుకీ మహిళలు క్రిస్టియన్ అలాగే వీడియో లో చూపబడ్డ మెతీ తెగ వ్యక్తి కూడా క్రిస్టియన్!
మెతీ ప్రజలలో కూడా మతం మారిన క్రిస్టియన్లు ఉన్నారు!psp
వీడియో వైరల్ అవగానే(చేయబడ్డది) హడావిడిగా సదరు నిందితుడి ఇల్లుని మహిళలు కూల్చివేశారు.
ఆ ఇల్లు అలాగే ఉంటే మీడియా కెమెరాలతో లోపలికి వెళ్లి చూపిస్తే అసలు బండారం బయట పడుతుంది.
అంచేత హడావిడిగా కూల్చివేశారు!psp
*************
దేశం అంతటా కిరోసిన్ చల్లబడ్డది!
*******************
చాలా ప్లాన్డ్ గా may 3 వ తారీఖున మొబైల్లో వీడియో తీసి పార్లమెంట్ సమావేశాలకు ముందు బయటికి వదిలారు.
ఓహ్! మణిపూర్ లో ఇంటర్నెట్ సేవలు కట్ చేశారు కదా? ఇదొక ఎలిబీ! మణిపూర్ నుండి వీడియో ఢిల్లీ కి చేరడానికి 40 రోజులు పట్టింది!
**************
ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతూన్న హింసకి మతానికి సంబంధం లేదు.పైకి కనపడేది వేరు కనపడకుండా జరుగుతున్నది వేరే!
******************
రెండువేల నోట్లు చెలామణీ నుండి ఉపసంహరించడం ప్రస్తుత మణిపూర్ హింసకి ప్రధాన కారణం!
******************
డ్రగ్ బిజినెస్ నడిచేది ప్రధానంగా డాలర్లు మరియు క్రిప్టో కరెన్సీ లో. కానీ స్థానిక కరెన్సీ అవసరం కూడా ఉంటుంది గంజాయి పండించే ముఠాలకి. ముఖ్యంగా మణిపూర్,నాగాలాండ్, మిజోరం బెల్ట్ లో నాగాలతో పాటు కుకీలు కూడా గంజాయి పండిస్తున్నారు కానీ వీళ్ళ దగ్గరకొనే దళారీలు వీళ్ళకి మన రూపాయల్లోనే చెల్లింపులు చేస్తారు. రవాణా కి అనువుగా ఉంటుంది అని పెద్ద నోట్లని అంటే ప్రస్తుతం 2వేలు,500 నోట్లనే స్టాక్ పెట్టుకున్నారు.ఇప్పుడు2వేల నోట్లు మార్చుకోవడం కష్టం అయ్యింది.psp
ఇప్పటికే 88% 2వేల నోట్లు తిరిగి వచ్చేశాయని RBI చెప్తున్నది. బహుశా 100% తిరిగి రాకపోవచ్చు.
********************
ప్రస్తుతం మెయితీ పెద్దలతో, అటు కుకీ పెద్దలతో శాంతి చర్చలు జరుపుతోంది కేంద్ర హోమ్ శాఖ.psp
*****************((*(
కానీ కుకీలు చట్టబద్ధం కాని పేచీలు పెడుతున్నారు.
కుకీల ప్రధాన డిమాండ్ ఏమిటంటే తాము గంజాయి పండించుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని.psp
****************
మణిపూర్ లో హింస ప్రజ్వరిల్లాడానికి కారణం?
1.మణిపూర్ లో ని థౌబల్(thoubal)లో అక్రమ డ్రగ్స్ ఫాక్టరీ ని కనుక్కుని దానిని నాశనం చేశారు.
2.500 KG బ్రౌన్ షుగర్ ని సీజ్ చేసింది మణిపూర్ ప్రభుత్వం.
3.మణిపూర్ లోని ఒక పోలీస్ chekpost ని పై అధికారులు తనిఖీ చేసినప్పుడు కిలోల కొద్దీ హెరాయిన్ దొరికింది. 
4.చెక్ పోస్ట్ లోని పోలీసులే హెరాయిన్ అక్రమ రవాణా వ్యాపారంలో భాగస్థులుగా ఉన్నట్లు విచారణలో బయట పడ్డది .
5. మొత్తం 6 గురు పోలీసుల్ని సస్పెండ్ చేసింది ప్రభుత్వమ్.
6. DIG రాంక్ పోలీసు అధికారులు కుకీలు చేసే డ్రగ్స్ అక్రమ రవాణా కి సహకరిస్తున్నట్లుగా విచారణ లో బయటపడ్డది. అయితే ఈ విషయం బయటపెట్టలేదు అక్కడి ప్రభుత్వం. కేవలం బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచింది.
7.మణిపూర్ పొరుగు రాష్ట్రం అయిన అస్సాoలో అక్కడి అస్సామ్ రైఫిల్స్ విభాగం 400 కోట్ల విలువచేసే డ్రగ్స్ ని పట్టుకొని సీజ్ చేసింది. ఇవి కుకీల నుండి స్వాధీనం చేసుకున్నారు.
*********************
దాదాపు 800 కోట్ల విలువ చేసే మత్తు పదార్ధాలు పట్టుబడ్డ తరువాత కొద్దీ రోజులకి మణిపూర్ హై కోర్టు మెతీ ప్రజల డిమాండ్ అయిన ST కాటగిరీ ని పరిశీలంచమని తీర్పు రాగానే హింసకి దిగారు కుకీలు.
*****************
May3,4 తారీఖులలో ఇద్దరు మెతీ మహిళలు రేప్ కి గురయ్యారు మరో నలుగురిని సజీవ దహనం చేశారు కుకీలు. ఈ విషయం మరుగున పడిపోయింది.
*****************
చిన్-కుకీలు:
బర్మా లోని చిన్ రాష్ట్రానికి చెందిన కుకీలని చిన్-కుకీలు అని పిలుస్తారు. అలాగే మిజోరం లో ఉండే కుకీలని మిజోకుకీలు అని పిలుస్తారు.
వీళ్ళు ఉండేది మణిపూర్ లో కానీ మణిపూరీ లు అని పిలిస్తే మాత్రం విపరీతమయిన కోపంతో కొట్టడానికి వస్తారు. ఇలాంటి విద్వేషాపూరిత భావజాలాన్ని ఎవరు వీళ్ళ మెదళ్ళలో నింపారు?
******************
పొట్ట చేత పట్టుకొని మన దేశానికి శరణార్ధులుగా వచ్చిన వాళ్ళకి 1968 లో మెతీ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు.
******************
ఉండడానికి ఇళ్ళు కట్టించి ఇచ్చింది మణిపూర్ ప్రభుత్వం.
ఇంటిపన్ను కట్టలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ ఇంటి పన్నుని కట్టింది. ఫోటో చూడండి!
******************
అసలు ఈ రోజున ఈశాన్య రాష్ట్రాల ఇలా ఉండడానికి కారణం సెహ్రూ!
1954 లో సెహ్రూ చేసిన నిర్వాకం!
బ్రిటీష్ ఇవాంజలిస్టు అంటే క్రైస్తవ మత ప్రబోధకుడు అయిన వెర్రిర్ ఎల్విన్ (Verrier Elwin) నాగాలాండ్ కి గిరిజనుల మీద పరిశోధన చేయడానికి గాను మరియు సలహాదారుగా నియమించాడు. ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక నియామకం!
అయితే ఒక మత ప్రబోధకుడిని నియమిస్తే బాగోదని 
ఫిలాంట్త్రోపిస్ట్ గా పిలిచాడు ఎల్విన్ ని.
అయితే వెర్రిర్ ఎల్విన్ నాగాలాండ్ లో నాగాలు ఉండే చోటుకి నాగా సాధువులు ప్రవేశించకుండా నిషేధం విధించమని సెహ్రూ కి సలహా ఇచ్చాడు.
సెహ్రూ ఎల్విన్ కొరినట్లుగా నాగా సాధువులతో పాటు వేరే ఎవ్వరికీ ప్రవేశం లేకుండా నిషేధం విధించాడు!
కానీ క్రైస్తవ మత ప్రచారకులు మాత్రం స్వేచ్ఛగా వెళ్ళవచ్చు వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు!

****************
ఒక విదేశీయుడిని అందునా మతప్రచారకుడి ని మన దేశ గిరిజనుల మీద పరిశోధనకి అనుమతి ఇవ్వడం పెద్ద తప్పు.
ఎల్విన్ నాగా సాధువులకి ప్రవేశం లేకుండా నిషేధం విధించమని చెప్పడం దానిని సెహ్రూ అమలుచేయడం మరో చారిత్రిక తప్పిదం!
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ పేరుతో సెహ్రూ కుటుంబాన్ని చూపడం మీద ఒక మిత్రుడు ఇంకా ఎవరూ లేరా ? అంటూ వ్యంగంగా కామెంట్ చేసాడు.
సదరు వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు?
ఇంకా ఉంది….
జైహింద్!

Saturday, August 5, 2023

మణిపూర్ రాష్ట్ర చరిత్ర part 1

(Face book లో పార్థసారథి పొట్లూరి గారి పోస్ట్ copy paste) మణిపూర్ రాష్ట్ర చరిత్ర - part-1
ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతున్న ఘర్షణ ల గురించి మనం ఏదన్నా విశ్లేషణ చేయాలి అంటే చరిత్ర లోతుల్లోకి వెళితే కానీ విషయం బోధపడదు!
ఇప్పటి ఆగ్రహానికి ఎన్ని దశాబ్దాల అణిచితివేత ఉందొ తెలుసుకోవాలి!PSP
చరిత్రని మరిచిపోయిన జాతికి మనుగడ ఉండదు!
మరీ లోతుల్లోకి వెళ్లి విసిగించే ప్రయత్నం చేయను!PSP
********************
మణిపూర్ కి 3500 సంవత్సరాల చరిత్ర ఉంది.PSP
మహాభారత కాలంలో అర్జునుడు మణిపూర్ రాజ్య రా కుమారిని పెళ్ళిచేసుకున్నాడు అని స్థానికులు ఇప్పటికీ విశ్వసిస్తారు.psp
శతాబ్దాలుగా వైష్ణవం ఇక్కడ పరిఢవిల్లడానికి కారణం  అర్జునిడితో వియ్యం ప్రధాన కారణం!
కొంతమంది చరిత్రకారులు వైష్ణవ గురువుల వల్లనే గౌడియ వైష్ణవం వ్యాప్తి చెందింది అనేది వాస్తవ దూరం.
స్వతహాగా వైష్ణవమ్ ని ఆచరిస్తుండడం వలన ఒకరో ఇద్దరో వైష్ణవ గురువులు మణిపూర్ ని సందర్శించి ఉండవచ్చు.psp.
********************
7 సిస్టర్స్ గా ఇప్పుడు పిలవబడుతున్న ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఒకప్పుడు ఒకే రాజ్యoగ ఉండేది. ఎక్కువ కాలం మణిపూర్ రాజుల ఏలుబడిలో ఉండేది. 1 వ శతాబ్దం నుండి 1956 వరకు మణిపూర్ ని పాలించిన రాజుల వివరాలు ఉన్నాయి.psp
మనకి స్వాతంత్ర్యం వచ్చే వరకు మణిపూర్ ఒక స్వతంత్ర రాజ్యాంగ ఉండేది.psp
మణిపూర్ ని పాలించిన చివరి రాజు రాజా బోధ చంద్ర సింగ్ (1908-1956).
2000 సంవత్సరాల మణిపూర్ చరిత్రని పరిశీలిస్తే హిందూ రాజులు పరిపాలించారు.
మైతే ప్రజలు హిందువులు మరియు శ్రీ కృష్ణుని భక్తులు.
భారత దేశంలో ఉండే వైష్ణవుల ఆచార, వ్యవహారాల కంటే గౌడియ వైష్ణవ సాంప్రదాయం కొంచెం భిన్నంగా ఉన్నా వారి ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు. రాధాకృష్ణుల ని కొలిచే సాంప్రదాయం మణిపూర్ నుండి ఇతర ప్రాంతాలకి వ్యాపించింది.అయితే ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.psp
మణిపూర్ రాజ్యంలో మొదటినుండి ఉన్నది మెతీ హిందూ ప్రజలు అయితే వీరితో పాటు పర్వత ప్రాంతాలలో కొన్ని జాతులు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నా వారు ప్రకృతి ఆరాధకులు గా ఉండేవారు. ఇప్పుడు నాగా, కుకీ ,మిజో లుగా పిలవబడుతున్న  వారు కూడా ఒకప్పుడు ప్రకృతిని దేవతగా ఆరాధించే వారు అయితే ప్రధానంగా వేట, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేవారు. ఎవరితో ఎవ్వరికీ శత్రుత్వం ఉండేది కాదు.
********************
పునాది రాయి!
1870 లలో బ్రిటీష్ వారి దృష్టి మణిపూర్ మీద పడ్డది.
ఉత్తర భారతదేశంలో ఎండాకాలం లో వేడినుండి తప్పించుకోవడానికి మణిపూర్ అనువైన ప్రదేశంగా కనిపించింది. సంవత్సరం పొడవునా యూరోపుని తలిపించే వాతావరణం మణిపూర్ లో ఉండేది. కొన్ని విడిది కేంద్రాలు నిర్మించారు. బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులు కొంతమంది ఊటీ, కోడైకెనాల్ లు వెళితే మరికొంతమంది నైనిటాల్, మణిపూర్ లకి వెళ్లేవారు.psp
ముఖ్యంగా టీ తోటలు వాటి క్వాలిటీ బాగా నచ్చాయి వాళ్ళకి,పైగా ప్రకృతి సంపద ఎటూ ఉండనే ఉంది.
అప్పట్లో రోడ్ల సదుపాయం తక్కువ కాబట్టి ప్రయాణ సమయం ఎక్కువగా ఉండేది.
1930 లకి వచ్చే సరికి భూమిలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు కనుక్కోగల టెక్నాలజీ మొదటిదశలోనే ఉన్నా మొత్తానికి ఈశాన్య దేశంలో క్రూడ్ ఆయిల్ ఉన్నదని కనుక్కున్నారు.psp
దక్షిణాసియాలో మనకంటూ సుసంపన్నమయిన క్రైస్తవ దేశం ఉండాలి అని నిర్ణయించుకున్నారు. అది ఈశాన్య భారతదేశం. ఒక్క మణిపూర్ మాత్రమే కాదు నాగాలాండ్, మిజోరం.త్రిపుర, అస్సామ్,సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ,మేఘాలయ లు కలిపి ఒకే క్రైస్తవ దేశంగా ఉంటే అప్పుడు తమకి అనుకూలంగా ఉంటుంది అని ప్లాన్  చేశారు. psp.
అప్పటికే ఈశాన్య రాష్ట్రాల లో చర్చిలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, విద్య పేరుతో స్కూళ్లని కట్టడం లాంటివి మొదలుపెట్టాయి.
చర్చి టార్గెట్ మొదట గిరిజనులని మతం మార్చడం.
చివరి నుండి నరుక్కు రావాలి అని ప్లాన్.psp.
అంటే బర్మా సరిహద్దుల నుండి భారత్ లోపలికి ఒక క్రమ పద్ధతిలో మత మార్పిడులు చేసుకుంటూ వెళ్ళాలి.
మిజోరం లో వేగంగా మత మార్పిడులు చేశారు.
మరోవైపు మిగతా ఈశాన్య రాష్ట్రాలలో కూడా మత మార్పిడులు జరుగుతున్న తరుణంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యి జపాన్ సైన్యం బర్మా లోకి చొచ్చుకు వచ్చి మణిపూర్ ని కూడా స్వాధీనం చేసుకుంది1944 లో!
దాంతో చర్చి కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డది
జపాన్ సైన్యంతో కలిసి సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ fouj బర్మా లో తన సత్తా చాటింది 1944 లో.  ఇక బ్రిటీష్ వాళ్ళు భారత్ వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని భావించారు. 
కానీ ఇక్కడే ఒక విషయం బయటపడ్డది. అది బర్మా వైపు నుండి ఈశాన్య రాష్ట్రాల లోకి చాల తేలికగా చొరబడవచ్చు అని.
*************************
బ్రిటీష్ వాళ్ళ ముందస్తు వ్యూహం!
మణిపూర్ లో మెయితీ ప్రజలు హిందూ వైష్ణవులు కాబట్టి వాళ్ళని మతం మార్చడం కష్టం అని భావించిన బ్రిటీష్ అధికారులు విభజించి పాలించు అనే తమ సిద్ధాంతాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు.
Outer Line Permit - Inner Line Permit .
1.మొదట మణిపూర్ లోకి బయట నుండి ఎవరన్నా రావాలి అంటే ఔటర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి.
2.పర్వత ప్రాంతాలలో ఉండే నాగా,కుకీ లని కలవాలి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి.
3.కానీ చర్చికి సంబంధం ఉన్న వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికి అయినా వెళ్ళవచ్చు.
4.ముందు పర్వత ప్రాంతంలో ఉన్న నాగాలని,కుకీలని క్రైస్తవంలోకి మార్చారు. ఆ ప్రాంతాలలోకి మైతీ ప్రజలకి కూడా ప్రవేశం ఉండేది కాదు కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలిసే అవకావశం లేదు.
5.పర్వత ప్రాంతంలో ఉన్న నాగాలు, కుకీలు స్వేచ్ఛ గా మెతీ లు ఉండే ప్రాతంలో  తిరగవచ్చు.
6. పర్వత ప్రాంత నాగాలు, కుకీలు స్వేచ్ఛగా గంజాయి పండించి అమ్ముకోవడాన్ని అనుమతించారు బ్రిటీష్ అధికారులు. ఇదే కీలక పాత్ర వహించింది మతం మారడానికి.
7.గంజాయి మత్తులో ఉన్నప్పుడు మతం మార్చడం తేలిక!
*********************
1947 లో మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినా బ్రిటీష్ వాళ్ళు ఈశాన్య భారతం మీద ఆశ వదులుకోలేదు.
1.నెహ్రూ ప్రధాని కాగానే అప్పటి మణిపూర్ రాజు బోదచంద్ర సింగ్ నెహ్రు ని కలిసి రెండు డిమాండ్లని కోరాడు. ఔటర్లైన్, ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని తీసివేయమని కోరాడు.
2.మెతీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలని రక్షించడానికి మెతీ ప్రజలని ST కింద పరిగణిస్తూ రాజ్యాంగంలో పొందు పరచాలి!
3.అప్పటికే నిపుణులు రాజ్యాంగ విధి విధానాలను పొందుపరిచే పనిలో ఉన్నారు కాబట్టి రాజా బోదచంద్ర సింగ్ సరయిన సమయంలోనే నెహ్రూ ని కలిసాడు.
4.రాజా బోధ చంద్ర సింగ్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించి అమలు చేస్తానని హామీ ఇచ్చాడు నెహ్రు!
5.కానీ రాజా బోదచంద్ర సింగ్ అడిగిన దానికి భిన్నంగా నెహ్రు నాగా, కుకీలను ST కేటగిరీ కింద పొందు పరుస్తూ ఏకంగా రాజ్యాంగం 6 షెడ్యూ ల్ లో చేర్చాడు.
6.నాగా,కుకీలు ఉండే 90% ప్రాంతాలలో వేరే వాళ్ళు భూములు కొనడానికి వీలులేదు.కానీ నాగాలు, కుకీలు మాత్రం ఎక్కడయినా భూములు కొనవచ్చు.
7. విద్య, ఆరోగ్యం విషయాలలో ప్రత్యేక సదుపాయాలతో పాటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చాడు నెహ్రూ!
8.అసలు షెడ్యుల్ ట్రైబ్ అనే దానికి వారు ఏ మతానికి సంబంధం ఉన్నదో అన్నది వివరంగా లేదు.
9. 80% పర్వత ప్రాంతం నాగా, కుకీల ఆధీనంలో ఉంది. మిగతా లోయ ప్రాంతం20% మెతీ లతో పాటు ఇతరులు కలిసి జీవిస్తున్నారు.
10.గిరిజనులు హిందువులు కాదు అనే నినాదం ఇటీవల బాగా వినపడడానికి కారణం క్రైస్తవం ని విస్తరించే కుట్రలో భాగం!
11. బర్మా తో పాటు ఈశాన్య భారతంలో ప్రొటె స్టెంట్ క్రైస్తవం బలంగా ఉంది. సిరియన్ కాథలిక్ బలహీనంగా ఉంది మణిపూర్ లో.
12.నాగా, కుకీలని ST కేటగిరీ లో చేర్చడం వెనుక నెహ్రూ మీద అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ ఒత్తిడి ఉంది అన్నది నిజం.
13. అయితే అప్పటికే అంటే 1960 దశకంలోనే క్రైస్తవ జనాభా వేగంగా పెంచడానికి గాను బర్మా నుండి కుకీలని మణిపూర్ లోకి తీసుకురావడానికి కుట్ర జరిగింది అది విజయవంతంగా అమలు జరిగింది.
14.బర్మా నుండి వచ్చిన(తీసుకురాబడ్డ) శరణార్ధుల కి మణిపూర్ లో పునరావాసం కల్పించమని కోరుతూ 1967 లో కేంద్రం నుండి మణిపూర్ ప్రభుత్వానికి రాసిన లేఖలు బయటికి వచ్చాయి.
15. 1968 అంటే సంవత్సరం తరువాత రెండో లేఖ వచ్చింది మణిపూర్ ప్రభుత్వానికి బర్మా కాందిశీకులకి పునరావాసం కల్పించాలని కొరుతూ.
16. బర్మా నుండి తేబడ్డ వారు కుకీలు. సహజంగానే వీళ్ళకి ST హోదా ఉన్నది కాబట్టి నాగాలు ఉండే పర్వత ప్రాంతాలలో ఉండడానికి హక్కు ఉన్నది కాబట్టి పర్వత ప్రాంతాల్లో ,మరియ మైదాన ప్రాంతాల్లో ఉండే మెయితీ ప్రజలతో పాటు ఉండే హక్కు కూడా ఉంది.
17.చాలా వ్యూహాత్మకంగా బర్మా నుండి వచ్చిన కుకీలు అటు పర్వత ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాలలో కూడా స్థిరపడ్డారు.
18.అప్పటికే క్రైస్తవాన్ని ఆచరిస్తున్న నాగాలకి ప్రకృతిని ఆరాధించే కుకీలకి మత పరమయిన విభేదాల వల్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగేవి.
19.1985 నాటికి ఘర్షణలు కాస్తా చిన్నపాటి యుద్ధాలు జరిగాయి. డబ్బు, ఆయుధాలు పుష్కలంగా అందుబాటులో ఉండడం వలన కుకీల మీద నాగాలదే పైచేయిగా ఉండేది. చర్చి ద్వారా ఇవి అందేవి నాగాలకి.
20.80 వ దశకం చివరికి వచ్చేసరికి కుకీలలో ఒక వర్గం ని చీల్చి వాళ్ళకి డబ్బు, ఆయుధాలు ఇచ్చి ప్రోత్సహించింది చర్చి. ఈసారి కుకీలది పై చేయి అయింది నాగా ల మీద.
21.కుకీలకి అర్ధమయింది ఏమిటంటే క్రైస్తవం స్వీకరిస్తే డబ్బు, ఆయుధాలు దొరుకుతాయి అని.
22.కుకీలు అందరూ క్రైస్తవం స్వీకరించారు. తాత్కాలికంగా నాగల, కుకీల మధ్య వైరం తగ్గినా జాతుల మధ్య ఉండే అసహనం అలాగే ఉండిపోయింది.
23.క్రైస్తవం స్వీకరించినా పాత సాంప్రదాయాలని యధావిధిగా కొనసాగించే వెసులుబాటు ఇస్తుంది చర్చి.
24.ఇది జాతుల మధ్య మొదట ఘర్షణగా మొదలయ్యి చివరికి వేల మరణాలకి కారణం అవుతుంది. అక్కడ జరిగేది మత ఘర్షణ ఎంతమాత్రం కాదు కేవలం జాతుల మధ్య ఉండే వైరుధ్యాల వల్లనే. ఎందుకంటే వివిధ జాతులు వెలల్లో ఉన్నాయి కానీ మతం ఒక్కటే.
25. నాగాలాండ్, మిజోరం, మణిపూర్ లు బర్మా తో సరిహద్దులు కలిగి ఉండి బర్మాతో పాటు సౌత్ ఈస్ట్ దేశాలతో అనుసంధానం గా ఉండే రోడ్ మార్గాలతో కలుపబడి ఉంది. ఈ విషయం ప్రస్తావన చేయడానికి కారణం ఉంది.psp
26. 1975-79 ల మధ్య కాంబోడియా (కంపూచియా) నియంత పోల్ పాట్ జరిపిన మారణ హోమంలో 20 లక్షల మంది ప్రజలు మరణించారు. ఇది అప్పటి కాంబోడియా జనాభాలో నాలుగో వంతు.
27. 1975 లో పోల్ పాట్ బీజింగ్ వెళ్లి మావో ని కలిసి తిరిగి కాంబోడియా వచ్చాక మారణ హోమానికి పాల్పడ్డాడు. తన స్వంత ప్రజలని చంపడానికి ఖ్మెర్ రోగ్ ,పోల్ పాట్ లు పెట్టిన పేరు సాంస్కృతికవిప్లవం.
28.అల్ట్రా - మావోయిజం  గా పేరుపడ్డ ఆనాటి మారణ హోమంలో భాగంగా జాతుల, మతాల, వర్గాల మధ్య చిచ్చుపెట్టి నగరాలు, పట్టణాలు అనే భేదం లేకుండా ప్రజలని తీసుకెళ్లి మారుమూల ప్రాంతాలలో సామూహికంగ హత్య చేశాడు పోల్పాట్.
29. కాంబోడియా దేశంలో ఒకే రకమయిన ప్రజలు,ఒకే భాష, ఒకే సంస్కృతి ఉండాలి అనేది ఖ్మెర్ రోగ్, పోల్ పాట్ ల లక్ష్యం. మావో చేసింది అదేగా!
30.కాంబోడియా లో జరిగిన మారణ హోమానికి మావో చేసిన సహాయం అప్పట్లో 1.2 బిలియన్ డాలర్లు! అది ధనం, మిలటరీ రూపంలో చేసింది చైనా.
31. మన పొరుగు దేశం బర్మా(బ్రహ్మ దేశం) లో ఎప్పుడూ అశాంతి ఎందుకు ఉంటూ వస్తున్నది? కమ్యూనిజం ని ప్రమోట్ చేస్తూ వస్తున్నది చైనా.
32.రోహింగ్యా  లని బౌద్ధులు దేశం నుండి వెళ్లగొట్టడానికి అక్కడి ప్రభుత్వం సహకరించింది. రేపొద్దున బౌద్ధులని కూడా అలాగే చంపదని గ్యారంటీ ఉందా?చైనాకి కావలిసింది ఇదే!
33. 400 ల ఏళ్ల క్రితం అమెరికాలో క్రైస్తవం ఎక్కడ ఉంది? అమెరికాలో స్థానిక ప్రజలని మొత్తం నాశనం చేశాకే కదా అక్కడ యూరోపియన్లు స్థిరపడ్డది.
34. అటు కమ్యూనిస్ట్ లకి ఇటు చర్చికి అడవులలో ఉండే గిరిజన జాతులు ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ముందు మతం మార్చి (కమ్మీలకి నేరుగా చంపడం ద్వారా ఏక మొత్తంగా నిర్మూలించడానికే ఇష్ట పడతారు) తరువాత రోగాలు వ్యాపింప చేసి ఒక క్రమ పద్ధతిలో నిర్మూలిస్తారు .
మిగతాది పార్ట్ 2 లో.
జైహింద్!

మణిపూర్ చరిత్ర part 2

(Facebook లో పార్థసారథి పొట్లూరి గారి పోస్ట్ copy paste. )
యూరోపియన్ చర్చి కి ఈశాన్య భారత్ మీద శ్రద్ధ ఉంది!
దీనిని బలపరిచే చరిత్ర కి చెందిన బలమయిన సాక్ష్యాలు ఉన్నాయి అవి మనకి తెలినవే!
1.1947కి పూర్వమే ఈశాన్య భారత్ లో చర్చి కార్యకలాపాలు ఉన్నాయి . అలాగే 1947 తరువాత కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తమకి అనుకూలంగా చట్టాలను చేయించుకుంది.
2.మరోవైపు దేశ విభజన తరువాత తూర్పు పాకిస్థాన్ ని (ఇప్పటి బాంగ్లాదేశ్)కేంద్రంగా చేసుకుని అమెరికన్ CIA ఈశాన్య భారత్ మీద నిఘా పెట్టి చర్చికి సహకరిస్తూ వచ్చింది.
3. ప్రపంచం దృష్టిలో CIA వేరు చర్చి వేరు వేరుగా కనిపిస్తాయి. కానీ వాస్తవం ఏమిటంటే CIA చర్చి రెండూ ఒకరికి ఇంకొకరు సహకరించుకుంటాయి! ఇది బహిరంగ రహస్యం! అటవీ ప్రాంతంలో ఎక్కడన్నా చర్చి ఉంది అంటే అది CIA కి ఇంఫార్మేర్ గా పనిచేస్తుంది. అఫ్కోర్స్ ఇది గత రెండు వందల ఏళ్ల నుండి జరుగుతూనే ఉంది.
4.తూర్పు పాకిస్థాన్ లో ఏకంగా CIA కి ఆఫీసు ఉండేది. అంటే ఇప్పటి బాంగ్లాదేశ్ ని కేంద్రంగా చేసుకుని CIA మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, మేఘాలయ లో ఉన్న చర్చి ల నుండి కొరియర్ ల ద్వారా సమాచారం సేకరించేది.
5.1970 వ దశకంలో మిజోరం లో తీవ్రవాదం ప్రబలంగా ఉండేది. దీనికి CIA, చైనా, పాకిస్థాన్ ల నుండి ఆయుధాలు, డబ్బు, మిలటరీ గ్రేడ్ మందులు బర్మా ద్వారా మిజో నేషనల్ ఫ్రంట్ కి అందేవి.
6.మిజోరంలో అప్పటికే చర్చి కి సంబంధించి నెట్వర్క్ బలంగా ఉండేది. కాబట్టి సమాచారం బయటికి వచ్చేది కాదు.
7.1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం మొదలవుతుంది అని ముందుగానే పసిగట్టిన CIA ఇందిరకి పరోక్షంగా హెచ్చరికలు చేసింది.ఎందుకంత ఆసక్తి?
8.బంగ్లాదేశ్ లోకి భారత సైన్యం ప్రవేశించగానే బ్రిటన్, అమెరికాలు తమ నౌకా దళం ని బంగాళాఖాతంలో కి వెళ్ళడానికి ఆదేశాలు ఇచ్చాయి.
9.ఒకవేళ అమెరికన్ 7th ఫ్లీట్ నౌకాదళం కనుక చిట్టగాంగ్ రేవు కి చేరుకుంటే అది ఖచ్చితంగా తనని బంధించి అంతర్జాతీయ కోర్టులో తనని యుద్ధ నేరాల మీద విచారణ చేసి జైల్లో పెడతారని ఇందిర తన పిల్లలని తీసుకొని లండన్ వెళ్లిపోయింది.
10.ఇందిరని వాజపేయి గారు 'అపర దుర్గ' గా అభివర్ణించడం అనేది అబద్ధం.
11.శ్రీమతి పుపుల్ జయకర్ వ్రాసిన ఇందిరాగాంధీ- A బయోగ్రఫీ( PUPUL JAYAKAR – INDIRAGANDHI A BIOGRAPHY)పుస్తకంలో  ఇందిరని అపర దుర్గ గా వాజపేయి గారు అన్నారు అని తన స్వంత పైత్యం ని జోడించింది. దీని మీద వివరణ ఇస్తూ వాజపేయి గారు చాలా సార్లు ప్రెస్ మీట్ లలో చెప్పారు నేను అలా అనలేదు అని.
12 . సరే! సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయ ప్రస్తావన చేయాల్సి వచ్చింది. కానీ బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ ప్రయాత్నాలని అమెరికా, బ్రిటన్, చైనా, పాకిస్థాన్ లు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించాయి?
13.పాకిస్థాన్ కి అవసరం ఉంది ఎందుకంటే అది తూర్పు పాకిస్థాన్ కాబట్టి. కానీ అమెరికా బ్రిటన్ చైనాల కి ఎందుకు అంత ఆసక్తి? అమెరికా, బ్రిటన్, చైనాలకు ఈశాన్య భారతదేశం మీద ఆశ ఉంది. బంగ్లాదేశ్ కి సరిహద్దుల్లో ఉంది. బాంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పడితే వాళ్లకి నిఘా పెట్టడం కష్టం అవుతుంది కనుక.
14.చైనా కి అరుణాచల్ ప్రదేశ్ కావాలి. తరువాత ఒక్కో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.
15.బ్రిటన్ అమెరికాలకి మణిపూర్ కావాలి. 
16. అందుకే కమ్యూనిస్టు దేశం అయినా చైనాతో సఖ్యతగా ఉంది అమెరికా. మరో వైపు పాకిస్థాన్ తో అమెరికా అంట కాగడానికి కారణం తూర్పు పాకిస్థాన్. అది 1971 లో చేజారిన తరువాత అమెరికాకి  పాకిస్థాన్ అవసరం లేకపోయింది. కానీ సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్ లో ప్రవేశించిన తరువాత మళ్ళీ పాకిస్థాన్ అవసరం ఏర్పడింది అమెరికాకు.
17.ఇక్కడ జియో పాలిటిక్స్ ని అర్ధం చేసుకుంటే భారత్ తో అమెరికా, చైనా, పాకిస్థాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ లకి ఎందుకు శత్రుత్వం కొనసాగుతున్నదో తెలుస్తుంది.
18. కాశ్మీర్ ని ముస్లిమ్స్ పంచుకోవడానికి సహకరించిన పశ్చిమ దేశాలు మిజోరం, మణిపూర్ లని క్రైస్తవ దేశాలు పంచుకోవడానికి సహకరించాలి పాకిస్థాన్. ఇక అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఆక్రమించుకోవడానికి అమెరికా, పాకిస్థాన్ సహకరించాలి.
19.ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికాతో సహా ఐరోపా మొత్తం క్రైస్తవ దేశాలు. చైనా కమ్యూనిస్ట్ దేశం. పాకిస్థాన్ ఇస్లామిక్ రిపబ్లిక్. ఈ మూడు కూడా వేటికి అవే భిన్న ధృవాలు కానీ ఈశాన్య భారత్ విషయంలో ఒక్కటిగా కలిసి పోయాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.
20. చాలా వ్యూహాత్మకంగా 2014 నుండి పాశ్చాత్య విలేఖరులు బిజెపి ప్రభుత్వాన్ని హిందూ నేషనలిస్ట్ అని సంబోధిస్తున్నాయి కానీ ఇస్లామిక్ పాకిస్థాన్ అని కానీ, క్రిస్టియన్ నేషనలిస్ట్ బ్రిటన్ అని హెడ్డింగ్స్ పెట్టి వార్తలు వ్రాసాయా?
21.ఏదో ఒక కారణం చూపించి బలహీన దేశాల మీద దాడులు చేయడం నాటో దేశాలకి అలవాటు. దానికి ముందస్తుగా వాళ్ళకి కావాల్సిన చోట హింసను ప్రేరేపించడం చేస్తారు. ఆ హింస ఎలా ఉంటుంది అంటే స్థానిక ప్రభుత్వాలు అదుపు చేయలేనంతగా.
22.హింసను ప్రేరేపించడానికి గాను పుష్కలంగా డబ్బు, ఆయుధాలు సరఫరా చేస్తారు. ఈతరహా చర్యలు చాలా చోట్ల ఫలితాలని ఇచ్చాయి. అయితే కేవలం ఎవరి ఆదేశాలనో పాటిస్తూ గుడ్డిగా హింసకి పాల్పడరు ప్రజలు.
23.మత విశ్వాసాలని ఆయుధంగా వాడుకుంటారు.
24.డ్రగ్స్ అలవాటు చేసి ఆపై వాటిని తయారుచేసి సరఫరా చేసి డబ్బు సంపాదించడం అలవాటు చేస్తారు.
25.డ్రగ్స్, డబ్బు,ఆయుధాలు పుష్కలంగా సమకూరాక మత విశ్వాసానికి ముప్పు ఏర్పడ్డది అంటూ హింసకి ప్రేరేపిస్తారు.
25.CIA అనుసరించే ఈ తరహా ప్లాన్ కి చర్చి సహకరిస్తుంది.కేవలం మనుషుల్ని కొరియర్లు గా వాడుకున్న రోజుల్లోనే CIA,చర్చి విజయంతంగా తమ ఆపరేషన్స్ పూర్తిచేయగలిగాయి.
25.అలాంటిది కమ్యూనికేషన్ అనేది వివిధ రూపాలలో చాలా సురక్షిత రూపంలో తేలికగా లభ్యం అవుతున్నప్పుడు ఇంకెంత రహస్యంగా ఆపరేషన్స్ ని నిర్వహించుకోగలుగుతారు?
********************
మిజోరం అనే రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రం అని అధికారికంగా ప్రకటించబడ్డది అని ఎంతమంది కి తెలుసు?
అవును! మిజోరం క్రైస్తవ రాష్ట్రంగా అధికారికంగా ప్రకటించబడ్డది!
దీనికి పునాది 1856 లో పడ్డది!
బ్రిటిష్ వాళ్ళు 1856 లో మొదటి చర్చి కట్టిన తరువాత మిజోరంలో స్థానిక మిజో లని క్రైస్తవంలోకి మార్చడం మొదలుపెట్టారు.
Presbyterian Church అనేది మిజోల జీవితాలలో ఒక భాగం అయిపోయింది. 
విచిత్రం ఏమిటంటే Presbyterian Church కి సంబంధించి ప్రధాన కార్యాలయం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఉంది.
అంటే మిజోరం తో పాటు మేఘాలయ కూడా లిస్టు లో చేరిపోయింది అన్నమాట.
మిజోరం లో 88% క్రైస్తువుల జనాభా ఉంది.
3.3% హిందువుల జనాభా అదీ మణిపూర్ కి చెందిన మెయితీ లు 6 వేల మంది ఉన్నారు.
7.93% చెక్మా తెగకి చెందిన బౌద్ధులు ఉన్నారు కానీ వీళ్ళు బర్మా లోని ఆర్కాన్ ప్రాంతం నుండి వలస వచ్చినవాళ్ళు .
8000 వేల మంది మిజో బేనీ యూదులు కూడా ఉన్నారు.psp
******************
మిజోరం రాష్ట్రంలో ఏ నిర్ణయం అయినా చర్చి తీసుకుంటుంది దానిని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఆదివారం అందరూ చర్చికి వచ్చి ప్రార్ధనలు చేయాల్సిందే. ఇందుకోసం వ్యాపార సంస్థలు మూసివేస్తారు.
మీరు ఒక టూరిస్టు గా మిజోరం రాజధాని ఐజ్వాల్ కి వెళ్లారు అంటే శనివారంనాడు మంచినీళ్ళు బాటిల్స్ కొని పెట్టుకోవాలి లేకపోతే ఆదివారం టీ, టిఫిన్,భోజనం తో పాటు మంచినీళ్ళు బాటిల్స్ కూడా దొరకవు. అన్నీ షాపులు,రెస్టారెంట్స్ మూసి ఉంటాయి.
ఏదన్నా ముఖ్యమయిన ప్రకటన ఉంటే దానిని ఆదివారం చర్చికి ప్రార్ధన కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రకటిస్తారు దానిని అందరూ పాటిస్తారు.
********************
మనలో చాలా మందికి సుపరిచితమయిన ఫోటో ఒకటి ఉంది. అది మిజోరం రాజధాని ఐజ్వాల్ లో రోడ్ మీద ట్రాఫిక్ ఒక క్రమ పద్ధతిలో ఒక వాహనం వెనుక ఇంకొక వాహనం నిలిచి ఉన్న వైనం. కుడి వైపు మార్గం ఎదురుగా వచ్చే వాహనాలకు ఖాళీగా వదిలివేయబడి ఉండడం.
అలా క్రమశిక్షణ తో వాహనదారులు ఉండడం మంచిదే!
కానీ……
మిజోరం ప్రజలు తమని తాము యూరిపియన్ ల లాగా భావించుకోవడమే దాని అర్ధం!
పాకిస్థాన్ ప్రజలు తాము అరబ్బుల వారుసులము అని భావించుకుంటారు!
మిజోరం, మేఘాలయ, నాగాలాండ్,మణిపూర్ లోని పర్వత ప్రాంతాలతో కలుపుకొని ప్రత్యెక క్రైస్తవ దేశం కావాలని భవిష్యత్తులో ఆందోళనకి దిగకుండా ఉంటారా?
******************
మెజారిటీ ప్రజల కోరిక కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయమని అమెరికాతో పాటు బ్రిటన్, యూరోపియన్ యూనియన్ మన ఒత్తిడి చేయవు అన్న గ్యారంటీ ఉందా?
******************
ఇప్పటికే మణిపూర్ హింస మీద యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ గట్టిగా చర్యలు తీసుకోమని కోరింది ఎందుకు?
ఇద్దరు మహిళలు క్రైస్తువుల కాబట్టి!
*******************
బానిస కుతంబ చెక్ పోస్ట్:
ఎక్కడికి పోతున్నావు?
చర్చి:మిజోరం పోతున్నాను.
చెక్ పోస్ట్:వెనక ఆ మూట ఏమిటి?
చర్చి: ఇసుక
చెక్పోస్ట్:ఇంగ్లాండ్ నుండి ఇసుక తీసుకెళ్లి మిజోరం లో ఏం చేస్తావు?
చర్చి: జస్ట్ చల్లుతాను
చెక్ పోస్ట్: మిజోరం లో ఇసుక లేదా?
*************
చెక్ పోస్ట్ ఉద్యోగం పోయాక….
రేయ్ ఆగు ఆగు!
ప్రతిసారీ ఎదో పట్టుకెళ్లి పోయేవాడివి అదేందో చెప్పరా! 2014 లో చెక్ పోస్ట్ జాబ్ పోయింది రా నీ దయవల్ల.
చర్చి:ప్రతిసారి మూట(కాశ్మీర్) లో ఏముంది అని మూటని(కాశ్మీర్) చెక్ చేశారు కానీ …ఒకసారి కైనెటిక్ హోండా(మిజోరం) మీద వచ్చాను, ఇంకోసారి హోండా బైక్(మేఘాలయ) మీద వచ్చాను..ఇంకోసారి సుజుకి (నాగాలాండ్) మీద వచ్చాను. 
బానిస వారసత్వ ఉద్యోగమా?
అవును!
అందుకే దేశం …… నాకి పోయింది!
ఇంకా ఉంది…
జైహింద్!