Friday, June 2, 2017

లలిత సంగీతం ..మరుగున పడిన జ్ఞాపకం..

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఎనభయిల్లో పొద్దున్న 7 . 15  కి లలిత సంగీత శిక్షణ కార్యక్రమం ప్రసారం చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తున్నారేమో మరి తెలీదు. గురువు ఎదురుగా కూర్చుని చెప్తున్నట్టే నేర్చుకోటానికి ఎంతో సులువుగా ఉండేది.
అప్పట్లో ఆ ప్రోగ్రామ్మ్ ద్వారా నేను కూడా కొన్ని పాటలు నేర్చుకుని ఏదో వచ్చిరాక  ..నాకు తోచినట్టుగా ఫామిలీ gatherings లో పాడుతూ ఉండేదాన్ని. నేను నేర్చుకున్న పాటల్లో గుర్తున్నవి కొన్ని..

ఒదిగిన మనసున (దేవులపల్లి), అద్దమే చూసితినా (దాశరధి అనుకుంటా ) అలికిడైతే చాలు (దేవులపల్లి ) నిన్ను పిలిచాను (కరుణ శ్రీ ?) ఏ ఊహ వేసిన బొమ్మలో (దేవులపల్లి) మురళిధరా నిను గానక

సంగీతం ఎవరు కూర్చారో గుర్తుంచుకోవాలన్న జ్ఞానం అప్పట్లో లేకపోయింది.

తరువాత దూరదర్శన్ వారు కూడా లలిత సంగీతం ప్రసారం చేసేవారు. అందులో రెండు పాటలు నేర్చుకున్నాను. పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు..(దేవులపల్లి). ఈ పాట ద్వారం లక్ష్మి పాడారు. ఆ పాటలాగే ఆమె కూడా వాలు కళ్ళతో, ముద్ద మందారం లా..చిరునవ్వుతో ఎంతో అందం గా ఉండేవారు. ఇప్పుడు ఆమె గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసురాలు. తర్వాత రెల్లు పూలా పాన్పు పైనా ..ఈ పాట కూడా దేవులపల్లి వారిదే..కాని ఎవరు పాడారో గుర్తులేదు..ద్వారం లక్ష్మి గారా లేక ఇంకెవరైనానా..

కొన్ని పాటలు మన జీవితాలలో మరిచిపోలేని తీపి గుర్తులుగా, సంఘటనలుగా ఉండిపోతాయి. ఒక్కో పాట  ఒక్కో అనుభూతిగా మిగిలిపోతాయి.

అలాంటి జ్ఞాపకాల్లో నా మనసుకి ఎంతో స్వాంతన గా అనిపించే ఒక జ్ఞాపకం..
మా అత్త (గారు) పూవులేరి తేవే ..పాట సాహిత్యం అంటే చాలా ఇష్టపడేవారు. ఆ పాటని తరచూ నాతో పాడించుకుంటూ వుండే వారు. దానికి సింబాలిక్ గా ..తన గుర్తుగా తన వెండి పూలసజ్జని  నాకు బహుమతి గా ఇచ్చారు.

చాలా వరకూ ప్రతి ఒక్కరికి ఇలానే ఏవో పాటలతో ముడిపడిన మధుర జ్ఞాపకాలు వుంటాయేమో!!

1 comment:

Unknown said...

I too remember this song. It is very nice.